తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. వందల కేసులు నమోదు అవుతున్నాయి రాష్ట్రంలో. ప్రతీ రోజు కూడా 600 పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గత రెండు రోజుల నుంచి చూస్తే తమిళనాడు లో 700 పైగా కేసులు నమోదు అయ్యాయి ఆ రాష్ట్రంలో. 

 

కోయంబేడు తర్వాత తమిళనాడు లో కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. నేడు ఆ రాష్ట్రంలో దాదాపు 800 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో నేడు 786 కొత్త కేసులు నమోదయ్యాయి, మొత్తం 14,753 కేసులు ఆ రాష్ట్రంలో నమోదు అయ్యాయి. రాజధాని చెన్నై లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలకు కరోనా ఎక్కువగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: