క‌రోనాపై పోరుకు ప్రముఖ చానెల్‌ జీ తెలుగు రంగంలోకి దిగింది.  కరోనాపై పోరాటంలో దేశవాసుల ఐక్య స్ఫూర్తిని ప్రేరేపించేలా  *ఏక్‌ దేశ్‌ ఏక్‌ రాగ్‌* పేరిట ఒక వినూత్న సంగీత కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ‌ ప్రతినిధులు తెలిపారు. జీ సరిగమపలో భాగంగా 25 గంటల ఈ మ్యూజికల్‌ లైవ్‌–థాన్‌ను శనివారం నిర్వహించనున్నామన్నారు.

 

కరోనా మ‌హ‌మ్మారిపై పోరులో ప్రజల్ని ఐక్యం చేసేందుకు సంగీతాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నామన్నాని వారు తెలిపారు. ఇది పూర్తిగా డిజిటల్‌ కన్సర్ట్‌గా సాగుతుందని, దేశవ్యాప్తంగా పేరొందిన గాయకులు తమ తమ ఇళ్ల నుంచే జీ ఫేస్‌బుక్‌ పేజెస్‌ ద్వారా 350 రకాల ప్రదర్శనలు ఇస్తారని వారు వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: