ఒక పక్క కరోనా వైరస్ తో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు వైద్య సేవలు అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక వైద్య సేవలు అందించే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆందోళన కలిగించే అంశం. చాలా ఆస్పత్రుల్లో ఇప్పుడు వైద్య౦ కొరత తీవ్రంగా ఉంది. 

 

ఇక తాజాగా తెలంగాణాలోని భువనగిరిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఒక మహిళ వైద్యం వికటించి మరణించింది. దీనితో వైద్యుల తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద వాళ్ళు నిరసనకు దిగారు. తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: