లాక్ డౌన్ లో ఆర్ధిక ఇబ్బందులు ఒక పక్క అనారోగ్యం తినడానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు. కాని ఏ మాత్రం భయపడలేదు. ప్రాణాలు అంటే లెక్క చేయలేదు. ధైర్యంగా తన తండ్రికి అనారోగ్యం ఉండటంతో పంటి బిగువున తండ్రిని ఎక్కించుకుని గుర్గావ్ నుంచి బీహార్ లోని దర్బంగా కు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కి సొంత ఊరు వచ్చింది.
ఇంతకు ఆ చిన్నారి గుర్తొచ్చే ఉంటుంది కదా... ఆ చిన్నారి పేరు జ్యోతి. ఇప్పుడు ఆమెకు సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పిలుపు వచ్చింది. దీనిపై స్పందించిన చిన్నారి... నాకు ఆఫర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, వచ్చే నెలలో ట్రయల్స్ కోసం ఢిల్లీ వెళ్తాను" అని ఆమె చెప్పింది.
Bihar: Jyoti,who cycled around 1200 km carrying her injured father from Gurugram to their native place in Darbhanga,amid #COVID lockdown,has been offered trial by Cycling Federation of India. She says,"I'm very happy that I got offer,will go to delhi for trial next month".(22.05) pic.twitter.com/qNf41Zsf03
— ANI (@ANI) May 23, 2020