పాకిస్తాన్ లోని కరాచి లో జరిగిన విమానం ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముందు 66 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో 30 మంది మృతదేహాలను గుర్తించారు. వీరిలో చిన్నారులు మహిళలు ఎక్కువగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఇంకా ఎంత మంది మరణించి ఉంటారు అనేది తెలియడం లేదు. 

 

విమాన ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 8 మంది సిబ్బందితో పాటుగా మొత్తం 97 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎంత మంది మరణించారు అనేది లెక్క తెలియడం లేదు. ఇక విమానం కూలిన మోడల్ కాలని వాసులు పది మందికి తీవ్ర గాయాలు కాగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: