వరంగల్ గీసుకొండ మండల౦ గొర్రెకుంట గ్రామంలోని బావిలో దొరికిన మృతదేహాలు 9కి కూడా  వైద్యులు పోస్ట్ మార్టం పూర్తి చేసారు. దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రాధమిక నివేదికను అధికారులు విడుదల చేసారు. వాళ్ళు అందరూ కూడా నీళ్ళల్లో మునిగి చనిపోయారు అని అధికారులు పేర్కొన్నారు. ఇక నీళ్ళల్లో పడిన సమయంలో వారి ఒంటి మీద రాళ్ళ గాయాలు అయ్యాయి అని తెలిపారు. 

 

ఇక మరణించిన వారి మీద ఏమైనా విష ప్రయోగం జరిగిందా లేక ఇంకేదైనా మరణానికి కారణం ఉందా అనేది తెలుసుకోవడానికి గానూ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి నమూనాలను పంపించారు. ఇక మృతదేహాలను ఇక్కడే ఖననం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. బెంగాల్ తీసుకుని వెళ్ళే అవకాశం లేకపోవడ౦తో ఇక్కడే పూర్తి చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: