పాకిస్తాన్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణాలు 97 కి చేరుకున్నాయి. విమానంలో ఉన్నదీ 8 మంది సిబ్బంది తో పాటుగా 91 మంది ప్రయాణికులు అని అధికారులు లెక్క చెప్పారు. వీరిలో 97 మంది చనిపోయారని ఇద్దరు బ్రతికి ఉన్నారని వారికీ ఏ విధమైన గాయాలు కూడా కాలేదు అని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. 

 

బ్రతికిన వారిలో ఒకరు బ్యాంకు ఆఫ్ పంజాబ్ అధ్యక్షుడు అని చెప్పారు. మరో వ్యక్తి చిన్న పాప అని ఆమెకు తక్షణమే వైద్య సాయం అందించడం తో బ్రతికి బయటపడిందని అయితే ప్రమాదంలో ఆ బాలిక తన తల్లిని కోల్పోయిందని అధికారులు చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: