ముంబై తర్వాత పోలీసులు ఎక్కువగా భయపడుతున్న నగరం హైదరాబాద్. ఇక్కడ కరోనా కేసులు రోజు రోజుకి పెరగడం ఒకటి అయితే కరోనా కేసులు నమోదు అవుతున్న వారిలో పోలీసులు కూడా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్క రోజే ముగ్గురు పోలీసులకు హైదరాబాద్ లో కరోనా బారిన పడినట్టు సమాచారం. 

 

ఇక బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా వచ్చింది. ఆయన పది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో బాధిత కానిస్టేబుల్ విధులు నిర్వహించారు. ఇక ఆయన తో పని చేసిన వారికి కూడా కరోనా పరిక్షలు చేయగా వారికి నెగటివ్ వచ్చింది. ఇక కుటుంబ సభ్యులు అందరిని కూడా అధికారులు క్వారంటైన్ చేసారు. కాగా పోలీసు శాఖలో 10 మంది తెలంగాణాలో కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: