వ‌ల‌స కూలీల‌ను ప్ర‌మాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కర్ణాటకలో చిక్కుకున్న వలసకూలీలతో బెంగళూరు నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరిన బస్సుకు శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అయితే, ఈ మంటలను ముందే గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ ప్రయాణికులను కిందకు దించిన కాసేపటికే బస్పు పూర్తిగా దగ్ధమైంది. గుజరాత్‌లోని ఖేడా పట్టణానికి సమీపంలో మక్వా గ్రామం వద్ద అహ్మదాబాద్‌ - వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 25 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 28 మంది ఉన్నట్లు స‌మాచారం. డ్రైవర్‌ మంటలను గుర్తించడంలో ఏ మాత్రం ఆలస్యమైనా 28 మంది మంట‌ల్లో మృతి చెందేవారు. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పెను ప్రమాదం తప్పింద‌ని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: