తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో మొబైల్ చార్జర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తొమ్మిదేళ్ల బాలిక మొబైల్ కు చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించి కరెంట్ షాక్ తో మృతి చెందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అక్కాల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన వల్ల తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఉదయం మొబైల్ లో చార్జింగ్ అయిపోవడంతో మొబైల్ చార్జ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
స్విచ్ బోర్డుకు పెట్టిన చార్జర్ పట్టుకోవడంతో బాలిక ఘటనాస్థలంలోనే మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కరెంట్ షాక్ వల్ల తొమ్మిదేళ్ల కూతురు మృతి చెందడంతో బాలిక తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొబైల్ చార్జర్ తయారీ లోపాల వల్లే పాప షాక్ కు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: