తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై కనిపించి ఆ తర్వాత వెండితెరపై స్టార్ కమెడియన్ గా ఒక్క ఊపు ఊపిన బండ్ల గణేష్ తర్వాత నిర్మాత గా మారి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. ఆ మద్య తెలంగాణలో ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీల చేరి తనదైన సంచలన వ్యాఖ్యలతో హల్ చల్ చేశారు. తెలంగాణ లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత రాజకీయాలు తనకు సరిపడవని.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తిరిగి వెండితెరపై కన్నువేశారు. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. బండ్ల గణేష్ సోషల్ మాద్యమంలో ఎప్పుడూ తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.
తాజాగా మరోసారి తనదైన స్టైల్లో అప్పట్లో నా జీవితం కూడా ఇలాగే ఉండేది అంటూ ఓ ట్విట్ చేశారు. 44 ఏళ్ల క్రితం తాను, తన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని వెల్లడించారు. ఈ క్రమంలో బండ్ల గణేశ్ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఓ వ్యక్తి సైకిల్ కు పూజ చేసి దండం పెడుతుండగా, పక్కనే ఓ చిన్నారి కేరింతలు కొడుతుండడం చూడొచ్చు. అంతేకాదు, నువ్వంటే ఎప్పటికీ ఇష్టం నాన్నా అంటూ బండ్ల గణేశ్ తండ్రిని స్మరించుకున్నారు. ఎప్పుడూ నిర్మొహమాటంగా మాట్లాడుతూ.. బండ్ల గణేష్ ఇప్పుడు వెండితెరపై బిజీగా మారేందుకు సిద్దం అవుతున్నారు.
44 years back same like this me & my nanna 👵 love you nanna 🙏 pic.twitter.com/Smd6hiQ8CR
— BANDLA GANESH (@ganeshbandla) May 23, 2020