జనాలకు ఈ మధ్య కాలంలో టిక్ టాక్ పిచ్చి ఏ స్థాయిలో పెరిగిపోయిందో అందరికి తెలిసిందే. టిక్ టాక్ లో లైక్స్ కోసం ఎం చేస్తున్నారో ఏదో చేస్తున్నారో కూడా అర్ధం కాకుండా వ్యవహరిస్తున్నారు. మన దేశంలో టిక్ టాక్ ని ప్రేమించారు, టిక్ టాక్ తమ జీవితంలో భాగ౦ చేసుకుని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. 

 

తాజాగా తమిళనాడు లో ఒక ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు లో ని తిరునల్వేలి జిల్లాలో ఒక యువకుడు టిక్ టాక్ లైక్స్ కోసం పిల్లికి ఉరి వేసాడు. ఈ ఘటన పోలీసులకు తెలియడం తో వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: