దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రంరూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ప్రతి రోజు అక్కడ ఐదు వందలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 591 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 12,910కి చేరాయి. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 6412 యాక్టివ్గా ఉండగా, 6267 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 218 మంది మరణించారు. ఈ పరిణామాలతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇక దేశ వ్యాప్తంగా 1,25,101 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 6654 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.