వలస కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయి అని కాంగ్రెస్ తెలంగాణా అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఒక ప్లాన్ లేకుండా వారిని ఇబ్బంది పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వలస కార్మికుల విషయంలో ఆర్మీ ని దింపి ఉంటే బాగుండేది అని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

ఆసరా లేని వాళ్ళు చనిపోయినా పరవాలేదని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వలస కార్మికుల కోసం కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. వలస కార్మికుల కోసం కాంగ్రెస్ ఒక వెబ్ సైట్ ఓపెన్ చేస్తుందని అందరూ అందులో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వారికి సూచించారు వలస కార్మికుల కోసం కాంగ్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తుంది అని వారికి కేంద్రం అండగా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: