ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. అంగన్వాడీ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని ఆయన తన లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కరోనా సమయంలో జీవితాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్నారన్న లోకేష్...
అంగన్వాడీ వర్కర్లకు ఇంటింటికీ వెళ్లి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రసంశించారు. ప్రధాని గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద హెల్త్కేర్ వర్కర్లకు బీమా అందిస్తున్నారని గుర్తు చేసిన లోకేష్... ఈ జాబితాలో అంగన్వాడీ వర్కర్లు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అంగన్వాడీ వర్కర్లకు రూ.50లక్షల బీమా అందేలా చూడాలని లేఖలో సిఎం వైఎస్ జగన్ ని నారా లోకేష్ కోరారు.