వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని ఒక కోల్డ్ స్టోరేజి ఆవరణలో జరిగిన మరణాలపై ఫోరెన్సిక్ నివేదిక ప్రాధమికంగా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను అందులో ప్రస్తావించారు. 9 మందిని బ్రతికి ఉండగానే అందులో తోసేసారు అని గుర్తించారు. 

 

వాళ్ళు అందరూ నీళ్ళు లోపలి వెళ్ళడం తోనే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇక ఫోరెన్సిక్ నిపుణులను అక్కడికి తీసుకు వెళ్ళారు పోలీసులు. శవాలు దొరికిన విధానం అవి ఉన్న విధానాన్ని వివరించారు. ఏసీపీ డీసీపీ మళ్ళీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్ని రిపోర్ట్ లు బయటకు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించి ఏ విధంగా మరణించారు అనేది చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: