వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో 9 మంది మృతిపై అధికారులు విచారణ ముమ్మరం చేసారు. ఇప్పటికే అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఈ ఘటనపై విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సంఘటనా స్థలంలో మూడు మొబైల్ ఫోన్స్ ని అధికారులు గుర్తించారు. వాటిలో ఉన్న డేటా ని వాళ్ళు సేకరిస్తున్నారు. 

 

దర్యాప్తులో ఇది కీలకంగా మారే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో సెల్ ఫోన్ డేటా ఆధారంగా అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటన కు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఘటనకు ముందు ఘటనకు తర్వాత అనే దాని మీద ఇప్పుడు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాల ఆధారంగా విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: