హైదరాబాద్ లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో డస్ట్ బిన్ లో పసికందు  లభ్యం కావడం సంచలనంగా మారింది. ఆస్పత్రిలోని అవుట్ పేషెంట్ వార్డులో డస్ట్ బిన్ లో పసికందు దొరికింది. ఎవరో గుర్తు తెలియని మహిళ పసికందును వదిలి వెళ్ళిపోయిందని అధికారులు గుర్తించారు. 

 

సదరు పాపని పరీక్షల కోసం గానూ నిలోఫర్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఉదయం 5:30 ప్రాంతంలో బురఖా ధరించి వచ్చిన గుర్తు తెలియని మహిళ డస్ట్ బిన్ లో పడవేసినట్లుగా సీసీ ఫుటేజ్ లో గుర్తించారు అధికారులు. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు వార్డు క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: