తెలంగాణ‌ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న రాష్ట్ర‌వ్యాప్తంగా మరో 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 33, విదేశాల (కువైట్‌) నుంచి వచ్చిన వారు నలుగురుకాగా, మరో 15 మంది మ హారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. మొత్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,813కు చేరింది. శనివారం ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సం ఖ్య 49కి చేరుకుంది. తాజాగా 25 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటివరకు 1,068 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం గాంధీలో 696 మం ది చికిత్స పొందుతున్నారు.

 

కాగా, వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు ఎక్కువగా కరోనాబారిన పడుతుండ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందినవారు 35 మంది ఉండగా జగిత్యాల జిల్లాలో 30 మంది, మంచిర్యాల జిల్లాలో 23, నల్లగొండలో 7, మహబూబాబాద్‌లో 5, జనగామ‌లో5, సిరిసిల్లలో4, నిజామాబాద్‌లో 3, నిర్మల్, ఖమ్మం, కరీంనగర్‌లలో రెండేసి, భూపాలపల్లిలో ఒక కేసు నమోదైందని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: