ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా సుమారు రెండు నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబు ఇక జ‌నంలోకి వ‌స్తున్నారు. సోమ‌వారం ఉద‌యం 10.35గంట‌ల‌కు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖకు బ‌య‌లుదేర‌నున్నారు. ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజీ బాధితుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు. ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన త‌ర్వాత‌ ఆర్ ఆర్ వెంక‌టాపురంలో ఆయ‌న ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

అనంత‌రం అక్క‌డి నుంచి అదే రోజు విశాఖనుంచి రోడ్డుమార్గంలో అమరావతికి చంద్రబాబు రానునున్నారు. ఈ మేర‌కు తన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ డీజీపీకి చంద్ర‌బాబు లేఖ‌రాశారు. దీనిపై డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: