గుంటూరు జిల్లా పోలీసు విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సిఐలపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసారు. సిబిఐ కేసు విచారణ సందర్భంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఐజి ప్రభాకర్ రావు వెంకట్రావు, మల్లికార్జునరావు అనే ఇద్దరు సిఐలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. 

 

తమ పరిధిలోని అక్రమ నిర్బంధ కేసుకు సంబంధించి అర్బన్ పోలీసులపై సీబీఐ విచారణ చేస్తుంది. ఈ నేపధ్యంలోనే సదరు అక్రమ నిర్బంధంలో బాధ్యులైన ఇద్దరు సీఐలను ఐజీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28 నుంచి మరో మారు సీబీఐ బృందం విచారణ చేస్తుంది. ఇంకెంత మందిపై వేటు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: