ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇవ్వలేదు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి గానూ చంద్రబాబు రేపు విశాఖ వెళ్ళడానికి గానూ రెండు రాష్ట్రాల డీజీపీ లకు లేఖ రాసారు. చంద్రబాబు వెళ్ళడానికి తెలంగాణా డీజీపీ అనుమతి ఇచ్చారు. 

 

కాని ఏపీ డీజీపీ మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ముందు నుంచి చంద్రబాబు వస్తే క్వారంటైన్ లో ఉండాలని వైసీపీ నేతలు ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తనకు అనుమతి ఇవ్వాలి అంటూ చంద్రబాబు కేంద్రాన్ని కూడా కోరారు. విశాఖ వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన అమరావతి వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: