చిత్తూరు జిల్లాలో ఒక వింత సంఘటన జరిగింది. చిత్తూరు జిల్లాలోని కేవీపల్లి మండలం నక్కలదిన్నె వడ్డేపల్లి లో నీళ్ళ గురించి రెండు గ్రామాలకు గొడవ జరిగింది. దీనితో ముందు మహిళలు గొడవ పడ్డారు. ఆ తర్వాత రెండు గ్రామాల ప్రజలు కూడా దీనిపై మాటల యుద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత రెండు గ్రామాలు యుద్దానికి దిగాయి. 

 

ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఖరీదు అయిన కార్లు, బైకులు ధ్వంశం అయ్యాయి. అదే విధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకొని రెండు గ్రామాల ప్రజలను వేరు చేసి 20 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: