కాశ్మీర్ లో ఉగ్రవాదులకు ఆర్మీ స్థానిక పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో కీలక ఉగ్రవాదులను అక్కడ కాల్చి చంపేస్తున్నారు. పెద్ద ఎత్తున కాశ్మీర్ లోయలో ఆపరేషన్ లు చేస్తున్నారు. ఇక కీలక ఉగ్రవాదులు అనుకునే వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపధ్యంలోనే లష్కరే తోయిబా కు చెందిన కీలక ఉగ్రవాదులను అరెస్ట్ చేసారు. 

 

కీలకంగా చెప్పుకునే వసీం ఘని అనే ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ముగ్గురు సహాయం చేసే వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. వాళ్ళను ఎప్పుడు అరెస్ట్ చేసారు అనేది స్పష్టత లేదు. కాగా గత నెలలో 30 మంది ఉగ్రవాదులను ఆర్మీ చంపేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: