గత రెండు రోజులుగా కోలీవుడ్‌లో హీరో అజిత్‌ గురించి చర్చ కొనసాగుతోంది. అజిత్ మాస్క్ క‌ట్టుకుని త‌న భార్య షాలినీతో క‌లిసి హాస్ప‌ట‌ల్లో ఉండ‌డంతో అజిత్‌కు ఏమైంద‌ని అభిమానులు ఒక్క‌సారిగా ఆందోళ‌న చెందుతున్నారు. అజిత్‌, షాలిని ముఖాల‌కు మాస్క్‌లు క‌ట్టుకుని హాస్ప‌ట‌ల్‌కు వెళ్లిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అస‌లే క‌రోనా వేళ అజిత్ మాస్క్ క‌ట్టుకుని హాస్ప‌టల్‌కు రావ‌డం ఏంటా ? అని అంద‌రూ షాక్ అవుతున్నారు. 

 

దీనిపై అనేక ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అజిత్‌ తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని.. ఆయన్ను పరామర్శించడానికే అజిత్, షాలిని దంపతులు వెళ్లారని ఒక ప్రచారం జరుగుతోంది. మ‌రో టాక్ ప్ర‌కారం అజిత్‌కు ఇటీవ‌ల ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని.. దీని చెక‌ప్ కోసం వెళ్లాడ‌ని అంటున్నారు.  ఈ విషయమై అజిత్‌ వర్గం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా అజిత్‌ ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ నిలిచిపోవడంతో అజిత్‌ ఇంట్లోనే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: