4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సిఎం వైఎస్ జగన్ కే దక్కుతుంది అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో గ్రామ వాలంటీర్ సేవ మరువలేనిది అన్నారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు సముచిత స్థానం కల్పిస్తామని... 

 

అభివృద్దిని అడుగు అడుగునా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అసలు విద్యుత్ చార్జీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు కి లేదని ఆయన మండిపడ్డారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా అవంతి ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: