ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం... రెంటకుంట్లలో సావిత్రమ్మ అనే వైసీపీ నేత ఒకరు వాలంటీర్ పై దాడికి దిగారు. సౌమ్య అనే వాలంటీర్ పై సబ్సిడీ విత్తనాల గురించి దాడి చేసారు. వైసీపీ కార్యకర్తలకు మాత్రమే సబ్సిడీ విత్తనాలు, హౌసింగ్ సరుకులు ఇవ్వాలనీ... తన ప్రమేయం లేకుండా వేరే ఎవరి పేరునూ లబ్దిదారుల లిస్టులో  చేర్చవద్దు అని ఆర్డర్ వేయడం గమనార్హం. 

 

అయితే ఇందుకు సౌమ్య అంగీకరించలేదు. తాను అందరికి సేవలు చేస్తా అని ఏమైనా ఇబ్బంది ఉంటే పై అధికారులతో మాట్లాడుకోవాలని ఆమెకు సూచించింది. ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఏంటీ అంటూ... నా సంగతి నీకు తెలియదు అంటూ బూతుల పురాణం అందుకుని దాడికి దిగింది సావిత్రమ్మ. దీనిపై సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: