టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఏ ఫార్మాట్ అయినా సరే తాను తన ఆటతీరు తో కోహ్లీ అన్ని జట్ల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే అతనికి తాజాగా అవమానం జరిగింది. ఆస్ట్రేలియా కోచ్ బ్రాడ్ హాగ్ వరల్డ్ టెస్ట్ ఎలెవన్‌ డ్రీం టీమ్‌లో కోహ్లీ కి చోటు కల్పించలేదు. 

 

తన డ్రీం టీం లో నలుగురు ఆటగాళ్ళు ఇండియా నుంచి ఉన్నారు... మయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మ ఓపెనర్లు గా ఉన్నారు. అదే విధంగా అజింక్యా రహానే మహ్మద్ శమీ ని ఎంపిక చేసాడు. పాకిస్తాన్ కీలక ఆటగాడు బాబర్ ఆజం కి కూడా చోటు కల్పించాడు. దీనిపై విమర్శలు రావడంతో కోహ్లి గత 15 టెస్ట్ ఇన్నింగ్స్ లలో సరైన ప్రదర్శన చేయలేదు అని సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: