గోవా లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కరోనా కట్టడికి అక్కడ చాలా పక్కాగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం అక్కడ కట్టడి కాలేదు. ఇక తాజాగా గోవా లో 11 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అవి కూడా మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచి వచ్చిన వారి నుంచే రావడం గమనార్హం.

 

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మీడియా కు వివరించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా నిన్న ముంబై నుంచి వచ్చిన 11 మంది ప్రయాణికులు ట్రూనాట్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. దీనితో గోవా లో యాక్టివ్ కేసుల సంఖ్య 50 కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: