అనంతపురం జిల్లా హిందూపురం రహమత్ పురానికి చెందిన వైసీపీ నేత జబీ ఉల్లాపై కత్తితో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జబీ ఉల్లాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి కొంత విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. జబీ ఉల్లా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం గురించి ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జబీ ఉల్లాపై దాడికి పాల్పడింది సొంత చిన్నాన్న కొడుకే కావచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాతకక్షల కారణంగా దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జబీ ఉల్లా చిన్నాన్న కొడుకును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: