తమను చంద్రబాబు అడిగితే అనుమతి ఇస్తామని... ఏపీ హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. వైజాగ్ వెళ్ళడానికి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, బీజేపీ ప్రెసిడెంట్ కన్నాలకు లేని అభ్యంతరాలు చంద్రబాబుకు ఎందుకని ఆమె నిలదీశారు. ఆయన అనుమతి కోరలేదని ఆమె పేర్కొన్నారు. వాలంటీర్, సచివాల ఉద్యోగులతో ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారని ఆమె సిఎం జగన్ ని కొనియాడారు. 

 

అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించామన్న ఆమె... రైతు భరోసా పెంచి ఇస్తున్న ఘనత జగన్ సర్కారుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో మహిళలకు సున్నా వడ్డీ విడుదల చేశామన్నారు. గత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించామని చెప్పుకొచ్చారు.  పోలీస్ శాఖలో వీక్లీ హాఫ్‌ను ప్రకటించి అమలు చేస్తున్నట్టు వివరించారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: