తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా సరే స్పందన మాత్రం రావడం లేదు. 

 

అయితే ఆంధ్రప్రదేశ్ ని ఏ అనుమతి చంద్రబాబు అడగలేదు అని హోం మంత్రి సుచరిత మీడియా తో అన్నారు. తాజాగా దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. యూ టర్న్ అంకుల్ విశాఖకు పర్మిషన్ కేంద్రాన్ని అడిగారు కదా.. వారేమన్నారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. మీబోటి అంతర్జాతీయ నాయకులు అంతలోనే యూ టర్న్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీని పర్మిషన్ అడగటం ఏమిటి చెప్పండి? అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: