దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుంది. లక్ష కేసుల నుంచి రెండు లక్షల కేసుల వరకు కరోనా కేసులు వెళ్తున్నాయి. రెండు మూడు రోజుల్లో లక్షా 50 వేల వరకు కరోనా కేసులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మారుతీ సుజుకి ఉద్యోగికి కూడా కరోనా సోకింది. దీనితో సదరు సంస్థ ఉద్యోగులు అందరూ భయపడుతున్నారు. 

 

హర్యానాలోని గుర్గావ్ జిల్లా మనేసర్‌లో ఉన్న ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా లక్షణాలు కనపడట౦తో అతనికి కరోనా పరిక్షలు చేసారు అధికారులు. దీనితో కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్ అని వచ్చింది. అదే ప్లాంట్ లో పని చేస్తున్న మరో ఉద్యోగికి కూడా కరోనా వచ్చినట్టు తెలుస్తుంది. ఇక అతనితో కాంటాక్ట్ లో ఉన్న అందరిని హోం క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: