గల్ఫ్ దేశాల్లో కరోనా తీవ్రత ఇప్పుడు క్రమంగా పెరుగుతుంది. మధ్య ఆసియా కరోనాకి కేంద్ర బిందువు గా మారే అవకాశం ఉందని ఇప్పుడు అంచనా వేస్తున్నారు. దుబాయ్ సహా పలు నగరాల్లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అబుదాబీ లో కరోనా వచ్చి హైదరాబాద్ కి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

 

బుధాబిలోని సన్‌రైస్ స్కూల్ లో హిందీ టీచర్‌గా పని చేస్తున్న వ్యక్తి కరోనా బారిన పడగా అతను ఆదివారం ఉదయం కన్ను మూసాడు. అదే స్కూల్ లో పని చేస్తున్న ఆయన భార్య కూడా కరోనా బారిన పడింది. యుఏఈ లో మొత్తం 30 వేల కేసులు నమోదు అయినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: