తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వలస కార్మికుల రాకతో రూరల్ ఏరియాల్లో కూడా విస్తరిస్తోంది. తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పాసిగంటి మణెమ్మ(65) కు కరోనా పాజిటివ్ వచ్చింది. మణెమ్మ ఆమె భర్త మల్లయ్య ముంబైలోని తమ కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి ఈ నెల 14న స్వగ్రామానికి చేరుకున్నారు. అయితే.. వెంటనే వారిని అధికారులు హోంక్వారంటైన్లో ఉంచారు.
ఈక్రమంలో వృద్ధ దంపతులిద్దరికీ ఎంజీఎం దవాఖానలో పరీక్షలు నిర్వహించగా మల్లయ్యకు పాజిటివ్ అని వచ్చింది. అనంతరం మణెమ్మకు పరీక్షలు నిర్వహించగా శనివారం రాత్రి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్రావు తెలిపారు. వారిద్దరినీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు. దీంతో స్థానికంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.