వరంగల్ గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఒక కోల్డ్ స్టోరేజి లో జరిగిన 9 హత్యలకు సంబంధించి పోలీసులు మిస్టరీ చేధించారు. సంజయ్ కుమార్ అనే అనుమానితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేసారు. విచారణలో సంజయ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించాడు. అతను నేరం చేసినట్టు అంగీకరించాడు. వారు  అందరికి నిద్ర మాత్రలు ఇచ్చినట్టు చెప్పాడు. 

 

నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత హత్యలు చేశా అని ఒప్పుకున్నాడు. స్నేహితులతో కలిసి తాను ఈ హత్యలు చేసినట్టు అతను పోలీసులకు వివరించాడు. రేపు మీడియా ముందుకు నిందితులను ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. మరిన్ని వివరాలను మీడియా ముందు ప్రవేశ పెట్టిన తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: