తెలంగాణాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి అని భావించిన కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో నేడు 41 కోనా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో 23 మందికి రంగా రెడ్డి జిల్లాలో ఒకరికి కరోనా సోకింది. ఈ రోజు 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

 

వేరే రాష్ట్రాలకు చెందిన మరో 11 మంది వలస కూలీలకు కరోనా సోకింది. తెలంగాణా లో ఇప్పటి వరకు 1854 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 709 ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు వెయ్యి 92 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నలుగురు కరోనా కారణంగా నేడు ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: