ఈ మ‌ధ్య జ‌న‌సేన నేత‌, న‌టుడు నాగ‌బాబు త‌రుచూ దేశ‌భ‌క్తికి సంబంధించిన ట్వీట్లు చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న‌గాడ్సెపై చేసిన తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. తాజాగా.. మ‌రో ట్వీట్ చేశారు. ఇప్పుడు జై హింద్ నినాదం గురించి ట్వీట్ చేశారు. *భారతీయులందరికి ఒళ్ళు పులకరించే మాట *జై హింద్‌*. భారతీయులందరిని ఒక మాట మీద ఏకం చేసే మాట...ఈ గొప్ప మంత్రాన్ని అన్నది ఒక తమిళ విప్లవ వాది షణ్ముఖ రామన్ పిళ్ళై అన్న మాట. ఇండియ‌న్‌ నేషనల్ ఆర్మీ నాయకుడు సుభాష్ చంద్రబోస్ భారతీయులందరినీ ఏకం చేసే మాట కావాలని అడిగినప్పుడు ఆ మాట సజెస్ట్ చేశాడు* అంటూ ట్వీట్ చేశారు.

 

అలాగే మ‌రో ట్వీట్ కూడా చేశారు. * మన హైదరాబాదీ అబిద్ హసన్.(సుభాష్ సెక్రటరీ అండ్ close ఫ్రెండ్)...ఆ విధంగా ఈ గ్రేట్ స్లోగన్ వచ్చింది.ఈ పిక్చర్స్ లో ఉన్న వాళ్ళు అబిద్ హసన్ అండ్ సుభాష్ బోస్.. రైట్ సైడ్ పిక్ లో ఉన్నవారు షణ్ముఖ రామన్ రామన్ పిళ్ళై..* అంటూ ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: