వైసీపీ స‌ర్కార్‌ ఏడాది పాలనపై *మన పాలన-మీ సూచన* పేరుతో ఈరోజ ఉదయం 11 గంటలకు మేధోమథ‌న సదస్సును నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, సంక్షేమం - పాలన వ్యవస్థలో వికేంద్రీకరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టి అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ముందుకు వెళ్తున్నారు.

 

ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్య రంగంలో కీల‌క మార్పులు తీసుకొస్తున్నారు. ఈ మేధోమ‌థ‌న స‌ద‌స్సులో ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల ఆధారంగా మ‌రింత మెరుగైన పాల‌న అందించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వైసీపీవ‌ర్గాలు అంటున్నాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని వ‌రుస‌గా ఐదురోజులు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: