మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ఉద్ధవ్ కేబినెట్ లోని మరో మంత్రికి కరోనా నిర్ధారణ అయింది. మంత్రి అశోక్ చౌహాన్ కు కరోనా నిర్ధారణ అయినట్టు కీలక ప్రకటన వెలువడింది. అశోక్ చౌహాన్ ప్రస్తుతం అతని సొంత ప్రాంతమైన నాంధేడ్ లో చికిత్స పొందుతున్నాడు. గతంలో ఉద్ధవ్ కేబినెట్ లోని మంత్రి జితేంద్ర కరోనా భారీన పడగా తాజాగా మరో మంత్రి కరోనా భారీన పడటం గమనార్హం. 
 
మంత్రి జితేంద్ర రెండు వారాలు ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నాడు. నిన్న రాష్ట్రంలోని పరిస్థితుల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనుందని తెలిపారు. ప్రభుత్వం అదనపు ఆరోగ్య సౌకర్యాలతో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: