భారతదేశంలో కరోనా వైరస్ రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. రోజుకు సగటున రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్య రాకెట్ వేగంతో పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 6977 కొత్త కేసులు నమోదయ్యాయి. 154 మంది మరణించారు. సోమవారం ఉదయం 9 గంటల నాటికి దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,845 కు చేరుకుంది. 77103 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ బారి నుంచి 57,720 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశ‌వ్యాప్తంగా 4021మంది మ‌ర‌ణించారు. రోజురోజుకూ కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: