ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. రాష్ట్రంలో నిన్నటివరకు 2627 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 1807 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 56 మంది మృతి చెందారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు కేసులు నమోదు కాని ప్రాంతాల్లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు మన్యంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 
 
రంపచోడవరం మండలం బోలగొండ పంచాయితీ చెరువూరుకు చెందిన ఓ బాలుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కోయంబేడు నుంచి వచ్చిన వారు, కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులు కరోనా భారీన పడుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: