టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తాజాగా ఒక ఆంగ్ల పత్రికతో ముచ్చటించి బాలీవుడ్ లో తెరకెక్కిన మూడు చిత్రాలు తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తనకు బాలీవుడ్ పరిశ్రమ అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా బన్నీ తెలియజేశారు. బాలీవుడ్ లో తెరకెక్కిన చాలా చిత్రాలు తనకు ఇష్టమని మూడు సినిమాలను మాత్రం తాను ఎక్కువసార్లు చూశానని చెప్పారు. 
 
జో జీతా వహీ సికిందర్ సినిమా ఎంతో ఇష్టమని ఆ సినిమాను ఇప్పటివరకు 20సార్లు చూశానని చెప్పారు. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాను కూడా ఎక్కువసార్లు చూశానని... వ్యక్గిగతంగా ఆ సినిమా నుంచి మధురానుభూతిని పొందుతానని చెప్పారు. ఈ మధ్య కాలంలో విడుదలైన గల్లీ బాయ్ సినిమాను చూశానని ఆ సినిమా కూడా తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నారు. బన్నీ పుట్టినరోజు కానుకగా విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: