ఈ ఏడాది కాలంలో అవినీతిలేని గొప్ప వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు అందించామ‌‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరిగే ప‌రిస్థితి నుంచి నేరుగా ఇంటికే సేవ‌లు అందించేలా మార్పులు తీసుకొచ్చామ‌ని ఆయ‌న అన్నారు. ఏడాది కాలంలో 4ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ్రామ సచివాల‌యాల‌తో ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని అన్నారు. ఈరోజు చేప‌ట్టిన‌ *మ‌న పాల‌న‌-మీ సూచ‌న‌* కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ విషయాల‌ను వెల్ల‌డించారు.

 

అనినీతిలేని పాద‌ర్శ‌క‌త ఉన్న వ్య‌వ‌స్థ‌.. గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ అని ఆయ‌న అన్నారు. అవ్వాతాత‌ల‌కు నేరుగా ఇంటివ‌ద్ద‌నే పింఛ‌న్లు అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ల‌బ్ధిదారులు జాబితాను గ్రామ సచివాల‌యాల‌లోనే అందుబాటులో ఉంచుతున్నామ‌ని.. ఇలా అవినీతిలేని గొప్ప వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు అందించామ‌ని సీఎం జ‌గ‌న్ ఉద్ఘాటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: