ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పాలనలో సరికొత్త చరిత్ర సృష్టించే నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పాలనలో తనదైన నిర్ణయాలతో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అద్వితీయ నిర్ణయం తీసుకున్నారు. 

 

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలో సోమవారం నుంచి మన పాలన మీ సూచన పేరుతో ఏపీ సర్కార్ మేధోమథన సదస్సు నిర్వహిస్తోంది. అయితే తాజాగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఈ సదస్సు ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రంగాల నిపుణులతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన మరింత మెరుగు పరచడానికి మీ సలహాలు ఇవ్వండి అంటూ కోరుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సలహాలు అడగడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: