అన్నివ‌ర్గాల సంక్షేమ‌మే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నామ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మ‌హిళ‌లకు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత‌లో భాగంగా  45 ఏళ్లు పైబ‌డిన వారికి ఒక్కొక్క‌రికి రూ.18,750 అందిస్తున్నామ‌ని, ఇలా నాలుగేళ్ల‌లో వీరికి ఒక్కొక్క‌రికి ఏకంగా రు. 75 వేలు అందించామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. అలాగే.. అన్నిరంగాల్లోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

ల‌బ్ధిదారులు ఇబ్బందులు ప‌డ‌కుండా.. చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. ల‌బ్ధిదారులు కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా.. వారికే నేరుగా డ‌బ్బులు అందిస్తున్నామ‌ని అన్నారు. అస‌లు ఇలాంటి ప‌థంక మ‌రే రాష్ట్రంలోనూ లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో అవినీతి మ‌చ్చ‌లేని వ్య‌వ‌స్థ‌ను అందించామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: