తిరుపతి వెంకన్న స్వామి అంటే ఎంత భక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కలియుగ దైవం.. కొలిచినంతనే కోర్కెలు తీర్చే ప్రత్యేక్ష దైవం వెంకన్నసామి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమ ప్రత్యక్ష దైవాన్ని ఎప్పుడు కన్నులారా చూడాలా అన్న ఆశతో భక్తులు ఎదురు చూస్తున్నారు.  దాంతో భక్తులకు కనీసం స్వామివారి ప్రసాదాన్నైనా అందించాలని భావించిన టీటీడీ రాష్ట్రవ్యాప్తంగా లడ్డూలు విక్రయిస్తోంది.  గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలు విక్రయించారు. గుంటూరులో టీటీడీ కల్యాణమండపం రెడ్ జోన్ లో ఉన్నందున అక్కడ అమ్మకాలు చేపట్టలేదు.

 

గుంటూరులో ఈ నెల 30 నుంచి లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు.  రేపు మరో 2 లక్షల లడ్డూలు జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. నేడు విక్రయాలు ప్రారంభం కాగా కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి.  లడ్డూలు విక్రయించాలని తెలంగాణ, తమిళనాడు భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంతో, తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50 వేల లడ్డూలు పంపాలని టీటీడీ యోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: