వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నా మావోలు మాత్రం ఎక్కడా భయపడటం లేదు. దండకారుణ్యంలో ఇప్పుడు మరింతగా విస్తరించడానికి మావోలు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మీడియా ను మించిన సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. మార్చ్ 21 న చత్తీస్గఢ్ లోని విప్పనలో  లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. 

 

ఈ కాల్పుల్లో 17 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ వీడియో ని లైవ్ లో రికార్డ్ చేసారు మావోలు. రికార్డ్ చేసిన వీడియో ని మీడియా కు రిలీజ్ చేసారు. చనిపోయిన జవాన్లను కూడా సదరు వీడియో లో మావోలు చూపించారు. ఎవరు వచ్చినా సరే ఇలాంటి దుస్థితే పడుతుంది అని చెప్పారు. అదే విధంగా రాకెట్ లాంచర్లు, ఏకే 47 తో దాడులు చేస్తున్న విధానం కూడా వీడియోలో ఉంది. దండకారుణ్యం నుంచి సిఆర్పీఎఫ్ వెళ్ళాలి అని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: