గ్రామాల విషయంలో తెలంగాణా సిఎం కేసీఆర్ ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారు అనేది అందరికి తెలిసిందే. గ్రామాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడు గ్రామాల విషయంలో అధికారులకు సూచనలు చేయడం తో పాటుగా ప్రతీ విషయాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన సిద్ధిపేట నియోజకవర్గంలోని ఒక గ్రామ సర్పంచ్ కి ఫోన్ చేయడం గమనార్హం. ఆ నియోజకవర్గంలో మర్కుక్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామ సర్పంచ్ కి ఫోన్ చేసి గ్రామం ఎలా ఉందని ఆయన అడిగారు. అదే విధంగా కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం గురించి కూడా అడిగారు. ప్రారంభోత్సవానికి 1500 మందితో కాన్ఫరెన్స్ నిర్వహించే విధంగా ఏర్పాటు చెయ్యాలని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: