గత రెండు రోజులు గా ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపిన వ్యవహారం టీటీడీ ఆస్తులను అమ్మాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు అంటూ రాజకీయ పక్షాలతో పాటుగా హిందు ధార్మిక సంస్థలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసాయి. ఇక ఇది పక్కన పెడితే ఈ వ్యవహారంలో సిఎం వైఎస్ జగన్ అధికారులపై సీరియస్ అయ్యారట. 

 

అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అడగకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారని సున్నిత అంశాల మీద సొంత పెత్తనాలు ఏంటీ అంటూ కొందరి మీద ఆయన నేరుగానే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనవసరంగా కొన్ని కొన్ని విషయాలను రచ్చ చేసుకోవద్దు అని సూచించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: